Vizag: సిటీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ శంకర్ రావు గురువారం ఉదయం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సెకన్ల వ్యవధిలో మరణించాడు.

By అంజి  Published on  12 April 2024 1:30 AM GMT
Vizag, City SPF Constable, Crime

Vizag: సిటీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

విశాఖపట్నం: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ శంకర్ రావు గురువారం ఉదయం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సెకన్ల వ్యవధిలో మరణించాడు. బ్యాంక్ క్యాష్ చెస్ట్ ఉన్న ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు కాపలాగా అతను, మరో నలుగురు కానిస్టేబుళ్లను నియమించారు. ఏరియా ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ రావు ఉదయం 5 గంటలకు బ్యాంకులో విధులకు హాజరయ్యారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

బ్యాంకులో కానిస్టేబుళ్లకు కేటాయించిన గదిలో ఎవరూ లేని సమయంలో, శంకర్ రావు ట్రిగ్గర్‌ నొక్కి తనను కాల్చుకున్నాడు. తుపాకీ కాల్పుల శబ్దం విన్న మరో కానిస్టేబుల్ గదిలోకి వెళ్లి చూడగా శంకర్ రావు నేలపై గాయపడి పడి ఉన్నాడు. మిగిలిన ముగ్గురు కానిస్టేబుళ్లు గదిలోకి వెళ్లే సమయానికి శంకర్‌రావు మృతి చెందాడు. శంకర్ రావు విజయనగరం జిల్లా రాజాం గ్రామ నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story