భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రంబ్లో దాచి మరీ..
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను అతి కిరాతకంగా చంపింది.
By అంజి Published on 19 March 2025 9:08 AM IST
భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రంబ్లో దాచి మరీ..
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను అతి కిరాతకంగా చంపింది. లండన్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్.. తన భార్య ముస్కాన్ బర్త్ డే కోసం ఫిబ్రవరి 24న భారత్కు వచ్చాడు. ప్రియుడు మోహిత్తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్.. సౌరభ్ను చంపాలని ప్లాన్ చేసింది. అతడు రాగానే, చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటపడ్డాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు మంగళవారం తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్పుత్ (29) మార్చి 4న కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న ఇందిరా నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు. అనుమానం ఆధారంగా, పోలీసులు అతని భార్య ముస్కాన్ (27), ఆమె ప్రేమికుడు సాహిల్ (25) లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, వారు రాజ్పుత్ను హత్య చేసినట్లు అంగీకరించారు.
విచారణలో ముస్కాన్, సాహిల్ మార్చి 4న సౌరభ్ను పొడిచి చంపినట్లు అంగీకరించారు. ఆ తర్వాత ఇద్దరూ అతని శరీరాన్ని ముక్కలుగా చేసి, అవశేషాలను డ్రమ్లో ఉంచి, సిమెంట్తో మూసివేసినట్లు సింగ్ చెప్పారు. సౌరభ్ కుటుంబం ప్రకారం.. ముస్కాన్ సౌరభ్ ఫోన్ నుండి సందేశాలు పంపడం ద్వారా తమను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించింది. నేరం చేసిన తర్వాత, ఆమె సాహిల్ తో కలిసి ఒక కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లిందని ఆరోపించారు.
ప్రేమ వివాహం తర్వాత 9 సంవత్సరాల ఘోర నేరం
బ్రహ్మపురి ఇంద్రానగర్ ఫేజ్ 2 కి చెందిన సౌరభ్ 2016 లో గౌరీపురానికి చెందిన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కుటుంబాలు వారి సంబంధం పట్ల అసంతృప్తితో ఉన్నాయని, దీంతో ఆ జంట తమ మూడేళ్ల కుమార్తెతో ఇంద్రానగర్ ఫేజ్ 1లోని అద్దె ఇంట్లో విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. సౌరభ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.