ద్విచక్ర వాహనంపై ట్రాలీ సూట్ కేస్ తో వెళుతుండగా చూసేశారు.. తీరా విచారిస్తే..!

UP man slits father's throat over money. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో తన తండ్రి గొంతు కోసి, తల నరికి, శరీర భాగాలను

By Medi Samrat  Published on  13 March 2023 1:18 PM GMT
ద్విచక్ర వాహనంపై ట్రాలీ సూట్ కేస్ తో వెళుతుండగా చూసేశారు.. తీరా విచారిస్తే..!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో తన తండ్రి గొంతు కోసి, తల నరికి, శరీర భాగాలను సూట్‌కేస్‌లో ఉంచి వాటిని పారవేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగా వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తివారీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుండ్ కాలనీలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. బాధితుడి తమ్ముడు ప్రత్యక్ష సాక్షిగా మారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.


నిందితుడి సోదరుడు ప్రశాంత్ గుప్తా ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రిన్స్ గుప్తా తన తండ్రి మధుర్ గుప్తాను పదునైన ఆయుధంతో హత్య చేశాడు. అతని తండ్రి డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రిన్స్ కోపంతో తండ్రిని హత్య చేశాడు. నిందితుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రశాంత్ గుప్తా గమనించి అడగ్గా.. ప్రిన్స్ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. ఇంట్లో రక్తపు ఆనవాళ్లను గమనించిన ప్రశాంత్ కు ట్రాలీ బ్యాగ్ కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో ప్రశాంత్ పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఇంటికి చేరుకోగా, తన తండ్రిని తానే హత్య చేసినట్లు ప్రిన్స్ అంగీకరించాడు. మా నాన్న నాకు డబ్బు ఇచ్చి ఉంటే.. నేను ఆయన్ను చంపేవాడిని కాదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రిన్స్ మొదట తన తండ్రిని కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించాడు, కాని విఫలమయ్యాడు. దీంతో నిందితుడు పదునైన ఆయుధంతో గొంతు కోసి తల వేరు చేశాడు. బాధితుడి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Next Story