తెలంగాణలో దారుణం.. కూలీ పని అని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌.. మహిళ మృతి

మెదక్ జిల్లా కుల్చారం మండలం ఏడుపాయల ఆలయం సమీపంలో ఓ మహిళ కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By -  అంజి
Published on : 12 Oct 2025 12:24 PM IST

Tribal woman assaulted, Edupayala temple, Medak, Crime

తెలంగాణలో దారుణం.. కూలీ పని అని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌.. మహిళ మృతి  

మెదక్ జిల్లా కుల్చారం మండలం ఏడుపాయల ఆలయం సమీపంలో ఓ మహిళ కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆ గిరిజన మహిళను శనివారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ తెల్లవారుజామున చెట్టుకు కట్టేసి అపస్మారక స్థితిలో కనిపించింది. మహిళకు చేతికి అనేక గాయాలు అయ్యాయి. నిందితులు శుక్రవారం ఉదయం మెదక్ పట్టణం నుండి మహిళను కూలీ పనికి నియమించుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఆమెను పనికి తీసుకెళ్లడానికి బదులుగా, వారు ఆమెను ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెను కొట్టి, అత్యాచారం చేశారని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించే ముందు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో ఆమె మరణించింది. సమీప ప్రాంతాల నుండి వచ్చిన సిసిటివి ఫుటేజ్‌లను ఉపయోగించి నిందితులను గుర్తించి, కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Next Story