పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది

By Knakam Karthik
Published on : 15 July 2025 2:05 PM IST

Crime News, Telangana, Peddapally District, Two Youth Murder

పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్ద మనుషుల పంచాయతీలో ఇరువర్గాల తీవ్ర ఘర్షణ ఈ హత్యలకు దారి తీసింది. ఈ క్రమంలోనే మాటమాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాలు ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగాయి. ఈ ఘర్షణలో మల్లేశ్, గణేష్‌లకు కత్తిపోట్లకు గురికాగా వారిద్దరూ తీవ్ర రక్తస్త్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Next Story