బాలిక పట్ల అసభ్యప్రవర్తన.. వ్యక్తిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలో ఓ హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఈనెల 25న మంజీర నదిలో మృతదేహం లభ్యమైన కె.రాములు (35)

By అంజి  Published on  28 May 2023 3:43 AM GMT
Sangareddy, Crime news, Manjeera river, Telangana

బాలిక పట్ల అసభ్యప్రవర్తన.. వ్యక్తిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలో ఓ హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఈనెల 25న మంజీర నదిలో మృతదేహం లభ్యమైన కె.రాములు (35) హత్య కేసులో ఏడుగురిని కుల్చారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు పాటి ఘానపూర్‌ గ్రామానికి చెందిన రాములును వివాహేతర సంబంధం పెట్టుకున్న మాయదారి వీరమణి ఆధ్వర్యంలోని ఏడుగురు వ్యక్తులు హత్య చేశారు. రాములు తన మైనర్ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆమె బంధువులు, స్నేహితుల సహకారంతో వీరమణి అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

వీరిద్దరూ మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని మెదక్ డీఎస్పీ బి.సైదులు తెలిపారు. అయితే రాములును వీరమణి హెచ్చరించినప్పటికీ, అతడు ఆమె మైనర్ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీని తరువాత ఆమె అతన్ని చంపడానికి పథకం వేసింది. మెదక్, కౌడిపల్లి నుంచి బంధువులు, స్నేహితులను రప్పించి మే 17న తమను కలవాలని రాములును ఆహ్వానించి ఇనుప రాడ్‌తో హత్య చేసి మృతదేహాన్ని మంజీరాలో పడేసింది. అరెస్టయిన వారిలో వీరమణి, మాయదారి నర్సింహులు, మాయాదారి అనిరుధ్, థక్వీర్ సింగ్, పట్నం మహేష్, ఎండీ ఆరిఫ్, మైదారి స్వప్న ఉన్నారు.

Next Story