సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రి మృతి

Road accident in suryapet.సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణీస్తున్న ఇద్ద‌రు మృతి చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2021 4:12 AM GMT
Road Accident

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణీస్తున్న ఇద్ద‌రు మృతి చెందారు. మునగాల మండలంలోని మాధవరం వ‌ద్ద‌ గుర్తుతెలియని వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మోట‌ర్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల‌ను కోదాడ సాలర్జంగ్‌పేటకు చెందిన గాధరి ఫ్రాన్సిస్(56), ఎల్లమ్మ(53)గా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్ర‌భుత్వ‌ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. దీనిపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story