ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది

By Knakam Karthik
Published on : 23 May 2025 2:36 PM IST

Crime News, Andrapradesh,  Prakasam District, Six Dead

రాష్ట్రంలో ఘోర ప్రమాదం, ఆరుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీసే ప్రయత్నం చేశారు.

Next Story