ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీసే ప్రయత్నం చేశారు.