వ‌న‌స్థ‌లిపురంలో పాల లారీ బీభ‌త్సం.. ఇద్ద‌రు మృతి

Road accident at Sushma Signal in Vanasthalipuram Two dead.వ‌న‌స్థ‌లిపురంలోని సుష్మ థియేట‌ర్ సిగ్న‌ల్ వ‌ద్ద మంగ‌ళ‌వారం ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2022 10:20 AM GMT
వ‌న‌స్థ‌లిపురంలో పాల లారీ బీభ‌త్సం.. ఇద్ద‌రు మృతి

వ‌న‌స్థ‌లిపురంలోని సుష్మ థియేట‌ర్ సిగ్న‌ల్ వ‌ద్ద మంగ‌ళ‌వారం ఓ పాల లారీ బీభ‌త్సం సృష్టించింది. హ‌య‌త్‌న‌గ‌ర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ వైపు పాలు తీసుకువెలుతున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో లారీ డివైడ‌ర్ ఢీ కొట్టింది. అయిన‌ప్ప‌టికీ లారీ ఆగ‌లేదు. ముందు వెలుతున్న బైక్‌ను ఢీ కొట్టి ర‌హ‌దారి ప‌క్క‌నే ఉన్న దుకాణాన్ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story