దారిలో వెళ్లే వ్యక్తులను బీడీకి చిల్లర ఇవ్వమని అడుగుతాడు.. ఇవ్వకుంటే..!

'Psycho killer' used to kill by stoning for not giving bidi, arrested in Madhyapradesh. రాళ్లతో కొట్టి హతమార్చే ఓ సైకో కిల్లర్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు

By M.S.R  Published on  4 Feb 2022 11:45 AM GMT
దారిలో వెళ్లే వ్యక్తులను బీడీకి చిల్లర ఇవ్వమని అడుగుతాడు.. ఇవ్వకుంటే..!

రాళ్లతో కొట్టి హతమార్చే ఓ సైకో కిల్లర్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులను రాయితో కొట్టి చంపాడనే అభియోగాలు మోపబడ్డాయి. అరెస్టయిన నిందితుడు డబ్బు, బీడీ వంటి చిన్న చిన్న వస్తువులు ఇవ్వకపోవడంతో రాళ్లతో కొట్టి చంపడం వంటి దారుణ ఘటనలకు పాల్పడి పారిపోయేవాడు. కట్ని ఎస్పీ సునీల్ జైన్ నుండి అందిన సమాచారం ప్రకారం, కట్నిలోని మాధవ్ నగర్, కుతాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు రాళ్ల దాడిలో మరణించారు. ఈ హత్యలలో మొదటిది జనవరి 28న మాధవ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోని జింఝరి పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలోని పిప్రౌంధ్ గ్రామంలో జరిగింది.

రెండో హత్య ఘటనలో పన్నా మోర్ చక్కి ఘాట్‌కు చెందిన చంద్రశేఖర్ నిషాద్ జనవరి 30-31 మధ్య రాత్రి కుతాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్‌లో ఉన్న అధికారిక నివాసం గది నంబర్ 38 వద్ద హత్యకు గురయ్యాడు. రెండు హత్యలు రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఎస్పీ సునీల్ జైన్ తెలిపారు. పోలీసులు నిందితుడి కోసం వెతుకుతూ ఎట్టకేలకు రెండు హత్యల నిందితుడు కైలాష్ అలియాస్ జోలా చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నిందితుడు కైలాష్‌పై రాళ్లతో కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అతడు జైలు నుండి విడుదలై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా అదే పని చేశాడు. ఇద్దరినీ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. విచారణలో కైలాష్ తాను చేసిన హత్యల్లో ఒకటి డబ్బులు ఇవ్వనందుకు, మరొకటి బీడీకి చిల్లర ఇవ్వనందుకు చేశానని చెప్పాడు.

Next Story