Nizamabad : వచ్చారు.. కాల్చి చంపారు.. డాబా దగ్గర వదిలేశారు..!

నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని దేవీతండా వద్ద జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, మరో లారీ డ్రైవర్‌ను కాల్చి చంపి పరారయ్యారు.

By -  Medi Samrat
Published on : 16 Dec 2025 9:25 PM IST

Nizamabad : వచ్చారు.. కాల్చి చంపారు.. డాబా దగ్గర వదిలేశారు..!

నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని దేవీతండా వద్ద జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, మరో లారీ డ్రైవర్‌ను కాల్చి చంపి పరారయ్యారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి తన లారీని 44వ జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో నిలిపి ఉంచాడు. అదే సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, నిలిపి ఉంచిన లారీలో ఉన్న సల్మాన్‌పై తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సల్మాన్‌ను స్థానికులు వెంటనే ఇందల్‌వాయిలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన దుండగులు, తాము వచ్చిన లారీని చంద్రాయన్‌పల్లి వరకు తీసుకువెళ్లి, అక్కడ ఒక డాబా వద్ద వదిలి వెళ్లిపోయారు.

Next Story