దారుణం.. పసికందును నీళ్ల బకెట్‌లో ముంచి చంపేసి, బ్యాగులో చుట్టి.. మహిళ, ప్రియుడు కలిసి..

Newborn found murdered in Kerala, mother and lover arrested. కేరళలోని త్రిస్సూర్‌లోని పున్‌కున్నంలోని ఎమ్మెల్యే రోడ్డు వద్ద ఉన్న కాలువలో నవ జాత శిశువు మృతదేహం లభ్యమైంది. నవజాత శిశువు హత్యకు

By అంజి  Published on  23 Dec 2021 4:10 AM GMT
దారుణం.. పసికందును నీళ్ల బకెట్‌లో ముంచి చంపేసి, బ్యాగులో చుట్టి.. మహిళ, ప్రియుడు కలిసి..

కేరళలోని త్రిస్సూర్‌లోని పున్‌కున్నంలోని ఎమ్మెల్యే రోడ్డు వద్ద ఉన్న కాలువలో నవ జాత శిశువు మృతదేహం లభ్యమైంది. నవజాత శిశువు హత్యకు గురైన కొన్ని గంటల తర్వాత మహిళ, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి నగర పోలీసులు వారిని అరెస్టు చేశారు. నవజాత శిశువును హత్య చేసిన కేసులో మేఘ (22), మాన్యువల్ (25), అతని స్నేహితుడు అమల్ (24)లను అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మృతదేహం గోనె సంచిని చుట్టి కనిపించినట్లు సమాచారం. ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని వైద్య కళాశాల మార్చురీకి తరలించారు.

సమీపంలోని కెమెరాల్లోని సీసీటీవీ దృశ్యాలను సేకరించగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు గోనె సంచిని కాలువలోకి విసిరినట్లు గుర్తించారు. దీంతో మాన్యుయెల్, అతని స్నేహితుడు అమల్‌ను అరెస్టు చేశారు. తదుపరి విచారణలో నేరానికి సంబంధించిన నమ్మలేని నిజాలు వెల్లడయ్యాయి. ఇరుగు పొరుగున ఉన్న మేఘా, మాన్యుయెల్ రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మేఘా గర్భవతి అయినప్పుడు, వారు దానిని ఆమె కుటుంబం నుండి దాచిపెట్టారు. శనివారం మేఘ తన గదిలోనే ప్రసవించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె తన నవజాత శిశువును నీటి బకెట్‌లో ముంచి చంపేసింది. అప్పుడే పుట్టిన శిశువు మృతదేహాన్ని బ్యాగులో చుట్టి ఉంచారు.

ఆ తర్వాత మాన్యువల్‌కు ఫోన్ చేసి చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచినట్లు సమాచారం అందింది. మరుసటి రోజు ఉదయం, ఆమె తన స్నేహితుడి సహాయం కోరిన మాన్యువల్‌కు కవర్‌ను అందజేసింది. మృతదేహాన్ని తగులబెట్టాలనే ఉద్దేశంతో రూ.150 విలువ చేసే పెట్రోలు కొనుగోలు చేశారు. అయినా కాల్చలేక మృతదేహాన్ని పాతిపెట్టాలనే ఉద్దేశంతో పేరమంగళం వచ్చారు. అయితే ఆ ప్రదేశం రద్దీగా ఉండడంతో మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. దీంతో వారు మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు సమాచారం. మేఘా ఎమ్‌కామ్‌ గ్రాడ్యుయేట్, త్రిసూర్‌లోని ఒక ఫైనాన్షియల్‌ సంస్థలో పనిచేస్తుండగా, మాన్యుల్ పెయింటింగ్ కార్మికుడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చిన్నారి డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా తదుపరి విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Next Story