మర్డర్ కేసు నిందితుడు.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి, ఆ తర్వాత శవమై కనిపించడంతో..
ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఓ హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు యువకులను కాల్చి చంపాడు.
By అంజి Published on 6 Nov 2024 6:30 AM IST
మర్డర్ కేసు నిందితుడు.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి, ఆ తర్వాత శవమై కనిపించడంతో..
ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఓ హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు యువకులను కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితుడు రాజేంద్ర గుప్తా (45) తన భార్య నీతూ గుప్తా (43), వారి కుమారులు నవేంద్ర (25), సుబేంద్ర (15), కుమార్తె గౌరంగిని (16) కాల్చిచంపాడు. ఈ ఘటన తర్వాత రాజేంద్ర గుప్తా తన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తరువాత, అతను నగరంలోని రోహనియా ప్రాంతంలో శవమై కనిపించాడు.
ప్రాథమిక దర్యాప్తులో అతను తన భార్య, ముగ్గురు పిల్లలను చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురించి కుటుంబ అద్దెదారుల నుండి సమాచారం అందుకున్న వారణాసి పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. ఓ సమస్యపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు. ఈ సంఘటన గురించి వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ, "ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు మాకు ఇన్పుట్లు వచ్చాయి. కుటుంబ కలహాలు, చేతబడి, అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నాము" అని తెలిపారు.
"రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుండి స్వాధీనం చేసుకున్నారు. అతను హత్య చేయబడ్డాడా లేదా ఆత్మహత్యతో మరణించాడా అని తెలుసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది" అని నిందితుడి మరణం గురించి అడిగినప్పుడు బన్స్వాల్ చెప్పారు. రాజేంద్రపై 1997 నుంచి హత్య కేసు పెండింగ్లో ఉందని, బెయిల్పై బయటకు వచ్చారని డీసీపీ తెలిపారు.