పాతబస్తీలో విషాదం.. మసీదులో ఉరివేసుకున్న యువకుడు

Muezzin hangs self in a Masjid in Hyderabad. హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. భవానీనగర్‌లో మసీదు

By అంజి  Published on  28 Dec 2022 4:13 AM GMT
పాతబస్తీలో విషాదం.. మసీదులో ఉరివేసుకున్న యువకుడు

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. భవానీనగర్‌లో మసీదు ముయెజిన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బీహార్‌కు చెందిన అస్గర్ బాద్‌షా అబ్దుల్ రహీ షేక్ (28) తాలబ్‌కట్టా ప్రాంతంలోని మసీదు ఇ ఫతేషాలో ముయెజిన్‌గా చేరాడు. మంగళవారం మధ్యాహ్నం మసీదు మొదటి అంతస్థులోని తన గదిలో ఉరివేసుకుని ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహ్మద్‌ అమ్‌జద్‌ అలీ, భవానీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ క్లూస్‌ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. "ముయెజ్జిన్ ఆత్మహత్య వెనుక వ్యక్తిగత కారణాలు కనిపిస్తున్నాయి, మేము అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాము. వాస్తవాలను ధృవీకరిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు. స్థానికులు కూడా మసీదు దగ్గర గుమిగూడడంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అబ్దుల్‌ ఆత్మహత్యకు అసలు కారణం తెలియాల్సి ఉంది.

Next Story