హైదరాబాద్లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik
హైదరాబాద్లో భారీ పేలుడు..పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
హైదరాబాద్లో శివారులోని పఠాన్ చెరులో ఘోర ప్రమాదం జరిగింది. పఠాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొందరు కార్మికులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం (జూన్ 30) ఉదయం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం సైరన్ భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
#Hyderabad:Reactor blast at #Patancheru Chemical UnitA reactor blast at Seegachi Chemicals in #Pasamailaram industrial area reportedly killed several workers and injured 20+.Factory engulfed in flames; rescue ops underway.#Fire engines & ambulances at spot.Death toll… pic.twitter.com/1uRxcm2YY9
— NewsMeter (@NewsMeter_In) June 30, 2025