Adilabad: భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామనుకున్నాడు.. అంతలోనే..

ఆదిలాబాద్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున నిలిచిన లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో భార్యను హత్య చేసిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

By అంజి  Published on  1 Sep 2023 6:45 AM GMT
Adilabad, murder, road accident, Crime news

Adilabad: భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామనుకున్నాడు.. అంతలోనే..

ఆదిలాబాద్ శివార్లలోని మమత జిన్నింగ్ మిల్లు వద్ద శుక్రవారం తెల్లవారుజామున నిలిచిన లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో భార్యను హత్య చేసిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మాట్లాడుతూ.. పట్టణంలోని బంగారి గూడకు చెందిన తాపీ మేస్త్రీ మోహితే అరుణ్ (30) తెల్లవారుజామున 4 గంటలకు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను హత్య చేసిన భర్త పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.

అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదికాస్తా పెద్దదవడంతో దీపను హత్యచేశాడు. తెల్లవారుజామున 3 గంటలకు కుటుంబ కలహాలతో దీప (25) తలను మంచానికి పగులగొట్టి అరుణ్ హత్య చేశాడు. అతను స్వయంగా లొంగిపోవడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లడం ప్రారంభించినప్పటికీ, అతని తండ్రి అతన్ని తిరిగి పిలిచినట్లు సమాచారం. ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మమత జిన్నింగ్ మిళ్తు ఎదుట ఆగిఉన్న లారిని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అరుణ్‌ అక్కడికక్కడే చనిపోయినాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story