గర్భిణి బంధువుపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య

ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన పొరుగున నివసించే గర్భవతి అయిన కోడలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  17 March 2023 4:05 AM GMT
Odisha, Crime news

గర్భిణి బంధువుపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య

ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన పొరుగున నివసించే గర్భవతి అయిన కోడలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని ఆ వ్యక్తి భార్య తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఆ దంపతులు బాధితురాలిని బెదిరించి, స్థానిక దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన సంఘటనను ఎవరికీ చెప్పవద్దని ప్రతిజ్ఞ చేయించారు. అయితే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని, అతని భార్యను అరెస్ట్ చేశారు.

ఒడిశాలోని ఖతిగూడా ప్రాంతంలోని జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన గర్భిణి తన బంధువు పద్మ రుంజికర్‌ను వైద్య కేంద్రంలో రెగ్యులర్ చెకప్ కోసం సహాయం కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు. పద్మ ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్)లో వర్కర్. బాధితురాలు ఫిబ్రవరి 28న వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిన సమయంలో పద్మ భర్త లిలియా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పద్మా రుంజికర్ గర్భిణిగా ఉన్న తమ బంధువుపై అత్యాచారం చేయడంలో తన భర్తకు సహాయం చేయడమే కాకుండా తన సెల్ ఫోన్‌లో ఆ చర్యను రికార్డ్ చేసింది.

వ్యక్తిగత కారణాలతోనే దంపతులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో పోలీసులు సైబర్ సెల్‌ను ఇంటర్నెట్ నుండి వీడియోను తీసివేయమని కోరారు. అత్యాచార ఘటనను రికార్డు చేసిన ఆశా వర్కర్ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆశా వర్కర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు పోలీసులు లేఖ పంపారు. 21 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పారు.

Next Story