మరో దారుణం.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య.. ప్రియుడే కావాలంటూ..

కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసి అతని మృతదేహాన్ని పారవేసిందని పోలీసులు తెలిపారు.

By అంజి
Published on : 29 Jun 2025 6:39 AM IST

Man objects to wife affair, chilli attack, Crime, Karnataka

మరో దారుణం.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య.. ప్రియుడే కావాలంటూ..

కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసి అతని మృతదేహాన్ని పారవేసిందని పోలీసులు తెలిపారు. జూన్ 24న నిందితురాలు సుమంగళ తన భర్తపై కారం పొడి పోసి, చెక్క కర్రతో కొట్టి, ఆపై అతని మెడపై తన పాదాలతో నొక్కి చంపిందని పోలీసులు తెలిపారు. తిప్తూరులోని కల్పతరు కళాశాల బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న సుమంగళ.. తన ప్రియుడితో నడిపిస్తున్న వ్యవహారం పట్ల శంకరమూర్తి అభ్యంతరం చెప్పాడు. దీంతో తన ప్రియుడు కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజుతో కలిసి సుమంగళ హత్యకు కుట్ర పన్నింది. సుమంగళ, నాగరాజు ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

శంకరమూర్తి హత్య తర్వాత, సుమంగళ, నాగరాజు అతని మృతదేహాన్ని గోనె సంచిలో నింపి 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఒక తోటలోని బావిలో పడేశారు. శంకరమూర్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. మొదట మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసిన నోనవినకెరె పోలీసులు, దర్యాప్తులో బాధితుడి ఫామ్‌హౌస్‌లోని పరుపుపై ​​కారం పొడి మరకలు, ఘర్షణ ఆనవాళ్లను కనుగొన్న తర్వాత అనుమానం వ్యక్తం చేశారు. సుమంగళ కాల్ రికార్డులను విశ్లేషించిన తర్వాత, పోలీసులు భయంకరమైన కుట్రను బయటపెట్టారు. ఆమె ప్రమేయాన్ని పోలీసులు నిర్ధారించారు. ఆమె భర్త తమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని భావించిన తర్వాత ఈ హత్య జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Next Story