Visakhapatnam: మహిళను హత్య చేసిన వ్యక్తి.. మృతదేహాన్ని పడేసేముందు పొట్టను కోసి..
35 ఏళ్ల మహిళను నరికి చంపిన వారం రోజుల తర్వాత విశాఖపట్నం నగర పోలీసులు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 19 Jun 2023 10:42 AM IST
Visakhapatnam: మహిళను హత్య చేసిన వ్యక్తి.. మృతదేహాన్ని పడేసేముందు పొట్టను కోసి..
35 ఏళ్ల మహిళను నరికి చంపిన వారం రోజుల తర్వాత విశాఖపట్నం నగర పోలీసులు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఒలికల్ ప్రదీష్గా గుర్తించబడిన అతను కేరళకు చెందినవాడు. ప్రస్తుతం తగరపువలస వద్ద గొల్లవీధిలో నివసిస్తున్నాడు. మృతురాలు, నిందితుడు భీమిలిలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రదీష్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తగరపువలసలోని ఓ పెంట్హౌస్లో గత ఆరేళ్లుగా ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఐరన్ ఫ్యాబ్రికేషన్ పని చేస్తున్నాడు. బాధితురాలు కూడా అక్కడే పని చేస్తోంది.
లైంగిక వేధింపుల కోసం డబ్బు విషయంలో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. జూన్ 9న భార్య, పిల్లలు కేరళ వెళ్లిన తర్వాత బాధితురాలిని ప్రదీష్ తన ఇంటికి పిలిపించుకున్నాడు. నిందితుడు రూ.500 మాత్రమే చెల్లించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. ఆమె రూ.800 డిమాండ్ చేయగా.. అందుకు అంగీకరించకపోవడంతో బలవంతంగా అత్యాచారం చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం నిందితుడు ఆమెను గొంతుకోసి హత్య చేశారు.
"నిందితుడు మద్యం సేవించి, శరీరం యొక్క బరువును తగ్గించడం కోసం రక్తాన్ని బయటకు తీయడానికి శరీరాన్ని నరికివేసాడు. అతను మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి తన బైక్పై ఉంచాడు. తరువాత, అతను మృతదేహాన్ని ఏకాంత ప్రదేశంలో పడేశాడు" అని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భీమిలి, K లక్ష్మణ మూర్తి తెలిపారు. అతను సంఘటన స్థలం నుండి తిరిగి వస్తుండగా, అతనికి చిన్న ప్రమాదం జరిగింది. కొంతమంది స్థానికులు గమనించారు. ఇది అరెస్టుకు దారితీసింది. జూన్ 11 రాత్రి, మృతదేహాన్ని ఏకాంత ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు.