తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు.. కాలీఫ్లవర్ దొంగిలించిందని..

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో 39 ఏళ్ల వ్యక్తి కాలీఫ్లవర్ దొంగిలించినందుకు వృద్ధ తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి ఆమెపై దాడి చేసిన ఆరోపణలపై అరెస్టు చేశారు.

By అంజి  Published on  25 Dec 2023 1:04 AM GMT
Odisha, cauliflower, Saraspasi, Keonjhar district, Crime news

తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు.. కాలీఫ్లవర్ దొంగిలించిందని.. 

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో 39 ఏళ్ల వ్యక్తి కాలీఫ్లవర్ దొంగిలించినందుకు వృద్ధ తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి ఆమెపై దాడి చేసిన ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితుడిని సరస్పసి గ్రామానికి చెందిన శతృఘ్న మహంతగా గుర్తించారు. “శనివారం, వృద్ధ మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినట్లు కొంతమంది గ్రామస్తులు మాకు సమాచారం ఇచ్చారు. మా సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ తర్వాత, నిందితుడైన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని మేము కనుగొన్నాము. కాబట్టి, అతనిపై కేసు నమోదు చేసిన తర్వాత మేము మహంతను అరెస్టు చేసాము, ”అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్ద కుమారుడు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడని అధికారి తెలిపారు. కుమారుడితో కుటుంబ కలహాలతో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. జీవనోపాధికి మరో మార్గం లేని ఆ మహిళ ప్రభుత్వ రేషన్‌తో పాటు ఇతర గ్రామస్తుల దయతో జీవించేది. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్న బాధితురాలు ఇటీవల కొడుకు పొలంలోని కాలీఫ్లవర్‌ను పొరుగింటి వారికి విక్రయించింది. విషయం తెలుసుకున్న ఆమె కొడుకు 60 ఏళ్ల వృద్ధురాలిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు. డిసెంబర్ 20న ఈ ఘటన జరిగింది. కొడుకు చేసిన పాశవిక చర్యకు సంబంధించిన వీడియో, ఫోటో కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి.

Next Story