హైదరాబాద్లోని హెచ్ఎంటీకి కాలనీకి చెందిన ఓ లేడీ డాక్టర్ సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరైన ఆ వ్యక్తి ఆ వైద్యురాలి నుంచి పలు దఫాలుగా నగదు, బంగారం తీసుకుని ముఖం చాటేశాడు. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. HMT కాలనీకి చెందిన ఒక యువ వైద్యురాలికి ఏడాది క్రితం సోషల్ మీడియా ద్వారా అమీన్పూర్ నివాసి సుబ్రహ్మణ్యం (32)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లోని హెచ్ఎంటీ కాలనీకి చెందిన మహిళా వైద్యురాలితో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి రూ.25 లక్షలు, 15 తులాల బంగారం మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆ తర్వాత వ్యక్తిగత ఫోటోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు.
తాను ఆన్లైన్ డెలివరీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నానని, కుటుంబ సమస్యలను చూపుతూ ఆమె నమ్మకాన్ని సంపాదించుకున్న నిందితుడు కొంతకాలంగా ఆమె నుండి రూ.25 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలి తల్లి నుండి 15 తులాల బంగారు ఆభరణాలను కూడా తీసుకున్నాడు. తరువాత డాక్టర్ వివాహం గురించి ప్రస్తావించినప్పుడు, సుబ్రహ్మణ్యం ఆమె వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేస్తున్నారు.