ఉపాధ్యాయురాలి హత్య కేసులో సంచలన నిజాలు.. దండుపాళ్యం సినిమా చూసి

Kadiri robbery murder, sensational facts in the case. క్రైమ్‌ థ్రిల్లర్‌తో వచ్చే సినిమాల ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటోంది. తాజాగా ఓ కేసులో నిందితుడు దండుపాళ్యం సినిమా

By అంజి  Published on  16 Feb 2022 7:54 AM GMT
ఉపాధ్యాయురాలి హత్య కేసులో సంచలన నిజాలు.. దండుపాళ్యం సినిమా చూసి

నేటి సమాజంలో సినిమాల ప్రభావం అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా మారింది. కొంతమందిపై సినిమాలు ఎంతగానో ప్రభావాన్ని చూపుతున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌తో వచ్చే సినిమాల ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటోంది. తాజాగా ఓ కేసులో నిందితుడు దండుపాళ్యం సినిమా నుండి ప్రేరణ పొంది దారుణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలి హత్య.. అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే ఈ దోపిడి హత్య కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దండుపాళ్యం సినిమా తరహాలో నిందితుడు హత్యతో పాటు దోపిడీకి పాల్పడ్డాడు. దండుపాళ్యం సినిమా చూసి.. పక్కా ప్లానింగ్‌తో హత్య చేసి, దోపిడీ చేశాడు.

3 నెలల పాటు 8 ప్రత్యేక పోలీసు బృందాలు ఎంతగానో శ్రమించి కేసును ఛేదించారు. ఐదు రాష్ట్రాల్లో గాలంపు, ఎన్నో ఫోన్‌ కాల్స్‌ విశ్లేషణ, 5 వేల మంది అనుమానితుల విచారణతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 30 అధికారులు, సిబ్బందితో ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కరుడు గట్టిన నేరస్తుడి నుండి ఏకంగా 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకలో నిందితుడిపై 7 కేసులు ఉండగా, కదిరిలో 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బైక్‌లను పెట్రోల్‌ దొంగతనం మొదలు పెట్టిని నిందితుడు.. చివరకు దండుపాళ్యం సినిమా తరహాలో హత్య చేశాడు.

Next Story