బాలికపై నలుగురు మైనర్లు గ్యాంగ్‌ రేప్‌.. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్

జార్ఘండ్‌లో దారుణం వెలుగు చూసింది. 19 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

By అంజి  Published on  5 May 2024 1:30 PM GMT
Jharkhand, social media, Crime

బాలికపై నలుగురు మైనర్లు గ్యాంగ్‌ రేప్‌.. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ 

జార్ఘండ్‌లో దారుణం వెలుగు చూసింది. 19 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు టీనేజ్ అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి మే 5 ఆదివారం తెలిపారు. ఈ సంఘటన ఏప్రిల్ 21 న జరిగినట్లు నివేదించబడింది. అయితే 15-17 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలు ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అధికారి తెలిపారు.

మే 3న బాలురు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని రామ్‌గఢ్ ఎస్పీ విమల్ కుమార్ తెలిపారు. "అమ్మాయి కుటుంబం మే 4న రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, ప్రొబేషన్ హోమ్‌కు పంపారు" అని ఎస్పీ తెలిపారు. ఏప్రిల్ 21న నలుగురు అబ్బాయిలు తనను రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోల్ డంపింగ్ యార్డ్‌లోని ఏకాంత ప్రదేశానికి ఈడ్చుకెళ్లడంతో ఈ ఘటన జరిగిందని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.

Next Story