జనగామలో టీడీపీ నేత దారుణ హత్య
Jangaon TDP Leader Murdered. జనగామలో దారుణం చోటుచేసుకుంది. జనగామ రెసిడెన్సియల్ స్కూల్ వద్ద టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ పులి స్వామిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
By Medi Samrat Published on
28 Jan 2021 2:51 AM GMT

జనగామలో దారుణం చోటుచేసుకుంది. జనగామ రెసిడెన్సియల్ స్కూల్ వద్ద టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ పులి స్వామిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దుండగులు స్వామిని గొడ్డళ్లతో నరికి చంపారు. మృతుడు పులి స్వామి టీడీపీ నేత. మార్నంగ్ వాక్ చేస్తున్న క్రమంలో పులి స్వామిని కిరాతకంగా గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story