Hyderabad: పాతబస్తీలో మహిళ దారుణ హత్య.. మృతదేహానికి నిప్పంటించి..

ఓల్డ్ సిటీలోని చంద్రాయణగుట్టలో బుధవారం రాత్రి భవన నిర్మాణ కార్మికురాలు తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని కేతావత్ బుజ్జి (55) గా గుర్తించారు.

By అంజి
Published on : 8 May 2025 1:47 PM IST

Hyderabad, Woman murder, body set ablaze, Chandrayangutta, Crime

Hyderabad: పాతబస్తీలో మహిళ దారుణ హత్య.. మృతదేహానికి నిప్పంటించి..

హైదరాబాద్: ఓల్డ్ సిటీలోని చంద్రాయణగుట్టలో బుధవారం రాత్రి భవన నిర్మాణ కార్మికురాలు తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని కేతావత్ బుజ్జి (55) గా గుర్తించారు. ఆమె చంద్రాయణగుట్టలోని ఇందిరా నగర్‌లోని ఒక ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్‌లోని అమ్రాబాద్‌. అర్ధరాత్రి సమయంలో, స్థానికులు ఆ మహిళ గదిలో మంటలు చెలరేగడాన్ని గమనించి చంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళ గొంతు కోసి చంపబడిందని, ఆమె మంచానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని గుర్తించారు. దుండగులు, మహిళను చంపిన తర్వాత, నేరాన్ని దాచిపెట్టడానికి మృతదేహాన్ని పూర్తిగా దహనం చేయాలని పథకం వేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Next Story