ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌ మహిళ దారుణ హత్య

భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్‌ మహిళ హత్యకు గురైంది.

By అంజి  Published on  10 March 2024 8:53 AM GMT
Hyderabad, murder, Australia, Crime news

ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌ మహిళ దారుణ హత్య

హైదరాబాద్: భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్‌ మహిళ హత్యకు గురైంది. చైతన్యను చంపిన దుండుగులు ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన చెత్త డబ్బాలో పారేశారు. శనివారం ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని బక్లీలోని డబ్బాలో ఆమె మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ మహిళ హత్యపై ఆస్ట్రేలియా పోలీసులు విచారణ చేపట్టారు ఆస్ట్రేలియా పోలీసులు శ్వేత అని కూడా పిలువబడే చైతన్య మాధగాని హత్యపై దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు సంబంధించి సెకండ్‌ క్రైమ్‌ సీన్‌ను పాయింట్‌ కుక్‌లోని మిర్కా వేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీ క్రియేట్‌ చేశారు. అయితే హత్య చేసిన వాళ్లు చైతన్యకు తెలిసిన వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. విక్టోరియా పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 'మృతురాలు, నిందితుడు ఒకరికొకరు తెలుసు'. 'అనుమానితుడు విదేశాలకు పారిపోయి ఉండవచ్చు' అని తెలిపింది. కాగా, హత్యకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందకముందే శ్వేత భర్త తమ మూడేళ్ల కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లినట్లు 9 న్యూస్ మెల్‌బోర్న్ పేర్కొంది. నిందితుడిని గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది.

Next Story