Hyderabad: పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి చేతిలో మైనర్ బాలిక హత్య

తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన మైనర్ బాలికను 30 ఏళ్ల వ్యక్తి కొట్టి చంపాడు. బాధితురాలి మృతదేహం మైలార్‌దేవ్‌పల్లిలోని కాటేదాన్‌లో కనుగొనబడింది.

By అంజి  Published on  30 March 2024 1:01 AM GMT
Hyderabad, Murder, Crime news

Hyderabad: పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి చేతిలో మైనర్ బాలిక హత్య

హైదరాబాద్ : తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన మైనర్ బాలికను 30 ఏళ్ల వ్యక్తి కొట్టి చంపాడు. బాధితురాలి మృతదేహం మార్చి 28, గురువారం అర్థరాత్రి మైలార్‌దేవ్‌పల్లిలోని కాటేదాన్‌లో కనుగొనబడింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు ముందు బాధితురాలిపై లైంగిక వేధింపులు జరిగాయా అని పోలీసులు నిర్ధారిస్తున్నారు. డిసిపి రాజేంద్ర నగర్, సిహెచ్. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఎలక్ట్రీషియన్ అయిన 30 ఏళ్ల మొయిన్ అహ్మద్‌ను ప్రేమిస్తున్నట్లు తెలిసింది.

“మొయిన్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేరం జరిగిన ప్రాంతంలోనే అతను నివాసం ఉంటున్నాడు. ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను చంపేందుకు పథకం పన్నాడు’’ అని అధికారి తెలిపారు. అతను ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు, అక్కడ ఆమెను బండరాయితో కొట్టి చంపాడు. అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించామని అధికారి తెలిపారు.

Next Story