Hyderabad: నిమ్స్‌లో భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సూపర్‌ స్పెషలిస్ట్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

By అంజి  Published on  28 Jan 2024 7:04 AM GMT
Hyderabad, Man died, NIMS, Crime news

Hyderabad: నిమ్స్‌లో భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సూపర్‌ స్పెషలిస్ట్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుచ్చయ్యగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చయ్య అనే వ్యక్తి చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారని, వైద్య పరీక్షలు నిర్వహించగా ఏదో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిందన్నారు.

అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి జారుకున్న అతను ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుచ్చయ్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story