దారుణం.. పెళ్లిరోజు మద్యం తాగొద్దన్నందుకు.. పురుగుల మందు తాగాడు

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి రోజున మద్యం తాగొద్దని చెప్పడమే భార్య తప్పైంది. ఈ ఘటన హైదరాబాద్‌

By అంజి  Published on  4 April 2023 4:38 AM GMT
Hyderabad , Crime news, Sucide,  Banjarahills‌

దారుణం.. పెళ్లిరోజు మద్యం తాగొద్దన్నందుకు.. పురుగుల మందు తాగాడు

ఈ మధ్య కాలంలో చాలా మంది దాంపత్య జీవితం సరిగా సాగడం లేదు. చిన్న చిన్న విషయాలకే గొడవపడుతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, తెగే దాకా లాక్కోవడం వల్ల దాంప్యత జీవితాలు దెబ్బతింటున్నాయి. తాజాగా భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి రోజున మద్యం తాగొద్దని చెప్పడమే భార్య తప్పైంది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కారు డ్రైవర్‌గా పని చేస్తున్న రాము (44).. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1లోని జర్నలిస్టులో కాలనీలో నివాసం ఉంటున్నాడు. మార్చి 31వ తేదీన పెళ్లి రోజు కావడంతో రాము తన భార్యతో కలిసి తెల్లవారుజామునే గుడికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి త్వరగా రావాలని, బయటకు వెళ్దామంటూ భర్తను భార్య కోరింది. దీంతో భర్త.. ఆమెతో గొడవపడ్డాడు. అదే రోజు సాయంత్రం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. పెళ్లి రోజు కూడా భర్త మద్యం తాగడ ఆమె ఒప్పుకోలేదు. భర్తను గట్టిగా నిలదీసింది.

దీంతో కోపంతో బయటకు వెళ్లిన భర్త పురుగుల మందు తాగొచ్చాడు. ఆ తర్వాత తాను పురుగుల మందు తాగానని భార్యకు చెప్పాడు. ఆ వెంటనే ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో భయాందోళనకు గురైన రాము భార్య.. అతన్ని మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు నిమ్స్‌కు రిఫర్‌ చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ రాము సోమవారం మృతిచెందాడు.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story