కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్తే..

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రే కన్నకూతురిపై అత్యాచారం చేశాడు.

By Srikanth Gundamalla  Published on  5 Jan 2024 5:23 AM GMT
hyderabad, crime, father, rape, daughter ,

 కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్తే..

ప్రస్తుతం కాలంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. బయటకు వెళ్లిందే చాలు ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం అందర్లోనూ ఉంటోంది. ఇక కొన్ని చోట్ల అయితే.. వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రే కన్నకూతురిపై అత్యాచారం చేశాడు. ఆమె ఆ బాధను తల్లితో చెప్పినా లాభం లేకపోయింది. చివరకు ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్లింది. కానీ.. అది కూడా ఆమె జీవితాన్ని మరో ప్రమాదంలోకి నెట్టేసింది.

జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటోంది. భార్యభర్తలతో పాటు ముగ్గురు పిల్లలుఉంటున్నారు. వారిలో ఒకరు కుమార్తె (18) ఏళ్లు. తొమ్మిదో తరగతి వరకే చదివించారు. కుటుంబీకులు కరోనా కారణంగా ఆమె చదువు మానిపించారు. దాంతో..ఆ యువతి ఇంటి వద్దే ఉంటోంది. కొంతకాలంగా తండ్రి సదురు యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పలుమార్లు అత్యాచారం కూడా చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే..ఎలాగోలా ధైర్యం చేసి తండ్రి విషయాన్ని యువతి తల్లికి వివరించింది. కానీ ఆమె నమ్మలేదు. తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కొట్టిపారేసింది. దాంతో.. ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు.

కాగా.. యువతికి సంతోష్‌ అనే వ్యక్తి గతేడాది దీపావళికి బీహార్‌ వెళ్లి తిరిగి వస్తుండగా రైలులో పరిచయం అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను ఒకరినొకరు షేర్ చేసుకున్నారు. రోజూ చాట్‌ చేసుకునేవారు. సంతోష్‌ బడంగ్‌పేట్‌ లోని గాంధీనగర్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 26న సంతోష్‌ యువతిని కలవాలని కోరాడు. దాంతో.. ఆమె సికింద్రాబాద్‌కు వెళ్లింది. ఇద్దరూ కలిసి ఆయా ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత ఆమెను కుత్బుల్లాపూర్‌లో ఇంటివద్ద వదలాడు. కానీ.. ఆ యువతి ఇంటికి వెళ్లలేదు. ఇంటికి వెళ్తే చెప్పకుండా బయటకు వెళ్లినందుకు తిడతారని భయపడింది. దాంతో.. తిరిగి సికింద్రాబాద్ స్టేషన్‌కు పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి సాయంతో సంతోష్‌కు ఫోన్ చేసింది.ఆ తర్వాత యువతి సంతోష్ ఇంటికి రవి సాయంతో వెళ్లింది. రోజు గడిచిన తర్వాత సంతోష్‌ యువతిని ఆమె ఇంటికి వెళ్లిపోవాలని చెప్పాడు. వెంట వచ్చిన రవిని యువతి ఉద్యోగం కావాలని కోరింది. దాంతో.. అతను సరే అని అమీన్‌పూర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు. రెండ్రోజులు యువతి రవి ఇంట్లోనే ఉంది. గత నెల 29న మద్యం మత్తులో గదికి వెళ్లిన రవి యువతిపై లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. వారు సికింద్రాబాద్ స్టేషన్‌ వద్దకు వచ్చి యువతిని తీసుకెళ్లారు. ఆ తర్వాత సదురు బాధితురాలు బుధవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పింది. తనపై దారుణాలకు ఒడిగట్టిన తండ్రి.. రవిపై ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్‌ను స్వీకరించిన పోలీసులు తండ్రితో పాటు రవి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

Next Story