భార్య పట్టించుకోవట్లేదని.. భర్త ఆత్మహత్య

Husband commits suicide because his wife does not care.. Incident in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉంచహర్

By అంజి  Published on  13 Jan 2023 11:40 AM GMT
భార్య పట్టించుకోవట్లేదని.. భర్త ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉంచహర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మాలిన్ గ్రామం పక్కనే ఉన్న కాలువలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. దీంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. భార్య పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. ఉంచహార్ పోలీస్ స్టేషన్‌లోని జమాల్‌పూర్‌లో నివాసం ఉంటున్న లాల్‌చంద్ లోధ్ (45 సంవత్సరాలు)కు తన భార్యకు తరచూ గొడవలు జరిగేవి. గొడవ తర్వాత లాల్‌చంద్‌ తన భార్యను బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె అంగీకరించలేదు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

భార్య పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేక లాల్‌చంద్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ''గురువారం ఒక మృతదేహం కాలువలో పడి ఉన్నట్లు నివేదించబడింది. ఘటనా స్థలానికి చేరుకున్న బృందం అతడిని బయటకు తీసుకొచ్చింది. అతడిని లాల్‌చంద్ లోధ్‌కు చెందిన జమాల్‌పూర్ సవయ్యగా గుర్తించారు.'' అని సీవో దాల్మావు అశోక్ కుమార్ తెలిపారు.

అతని శరీరంపై ఎలాంటి గాయం గుర్తు కనిపించలేదని చెప్పారు. అందుకే ఆత్మహత్యతో పాటు ఇతర అంశాలపై కూడా విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story