ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియుడితో కలిసి కన్నతల్లిని గొంతుకోసి చంపిన 16 ఏళ్ల కూతురు

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

By Knakam Karthik
Published on : 24 Jun 2025 10:50 AM IST

Crime News, Hyderabad, Jeedimetla

ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియుడితో కలిసి కన్నతల్లిని గొంతుకోసి చంపిన 16 ఏళ్ల కూతురు

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డు వస్తుందనే కారణంతో కన్నతల్లినే ఓ కూతురు ప్రియుడితో కలిసి హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం తెల్లవారుజామున ఒక మహిళను ఆమె టీనేజ్ కుమార్తె , ఆమె ప్రియుడు వారి ఇంట్లో హత్య చేశారు. అంజలి (39) జీడిమెట్లలోని ఎన్‌ఎల్‌బి నగర్‌లో తన కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. ఆ అమ్మాయి (తేజశ్రీ) వయసు కేవలం 16 సంవత్సరాలు. పదో తరగతి చదువుతోంది. ఆమె ప్రియుడు శివ వయసు 19 సంవత్సరాలు.

తమ ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి (39) మందలించిందనే కోపంతో శివ, అతని తమ్ముడు యశ్వంత్ (18)తో కలిసి తేజశ్రీ కిరాతకానికి పాల్పడింది. వీరంతా కలిసి అంజలి గొంతు నులిమి, తలపై రాడ్ తో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story