దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారు.. కారణం మాత్రం అదే.!

Four of a family found murdered in uttarpradesh. ప్రయాగ్‌రాజ్‌లోని ఫఫమౌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. నలుగురినీ

By అంజి  Published on  25 Nov 2021 12:45 PM GMT
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారు.. కారణం మాత్రం అదే.!

నవంబర్ 25 గురువారం నాడు ప్రయాగ్‌రాజ్‌లోని ఫఫమౌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. నలుగురినీ పదునైన ఆయుధంతో నరికి చంపారు. మృతుల్లో ఫూల్‌చంద్, అతని భార్య మీను, కుమార్తె సప్న, కుమారుడు శివ ఉన్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒక గదిలో మూడు మృతదేహాలు, మరో గదిలో బాలిక మృతదేహం ఉన్నట్లు ఎస్‌ఎస్పీ ప్రయాగ్‌రాజ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కుటుంబ సభ్యులందరినీ తలపై వేటు వేసి హతమార్చినట్లు తెలుస్తోందని అన్నారు. సుశీల్ కుమార్ అనే వ్యక్తితో ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని, గతంలో కూడా తమపై పలుమార్లు దాడి చేశారని మృతుడి ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు.

ఈ హత్య బుధవారం అర్థరాత్రి ఫఫమౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌గంజ్ ఫుల్వారియా గోహ్రీ గ్రామంలో జరిగింది. బాధితులను ఫుల్‌చంద్ (50), అతని భార్య మిను దేవి (45), కుమార్తె సప్న (17), కుమారుడు శివ్ (10) గా గుర్తించారు. వేర్వేరు మంచాలపై మృతదేహాలన్నింటినీ ఉంచారు. ఈ ఉదయం హత్యలకు సంబంధించిన సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

Next Story