ఘోర ప్రమాదం.. 6 వాహనాలు ఢీ.. ఐదుగురు మృతి

Five members of family dead after 5 vehicles pileup in Tamilnadu. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By అంజి  Published on  3 Jan 2023 5:13 AM GMT
ఘోర ప్రమాదం.. 6 వాహనాలు ఢీ.. ఐదుగురు మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. వెప్పూరు వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. మృతులంతా కారులో ప్రయాణిస్తున్న వారేనని తెలిసింది.

వేప్పూర్ అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కారులోంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. "మృతుల వివరాలను ఇంకా గుర్తించలేదు. కానీ కారు రిజిస్ట్రేషన్ పుస్తకం ప్రకారం, వాహనం చెన్నైలోని నంగనల్లూర్‌కు చెందినది. తదుపరి విచారణ జరుగుతోంది" అని పోలీసులు తెలిపారు.


Next Story