మ‌రో పోలీసు దారుణ హ‌త్య‌.. మ‌హిళా ఎస్సైపై నుంచి దూసుకెళ్లిన ట్ర‌క్కు

Female Cop Mowed Down During Routine Vehicle Check In Ranchi.హ‌ర్యానా రాష్ట్రంలో ఓ డీఎస్పీని మైనింగ్ మాపియా దారుణంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2022 7:42 AM GMT
మ‌రో పోలీసు దారుణ హ‌త్య‌..  మ‌హిళా ఎస్సైపై నుంచి దూసుకెళ్లిన ట్ర‌క్కు

హ‌ర్యానా రాష్ట్రంలో ఓ డీఎస్పీని మైనింగ్ మాపియా దారుణంగా హత మార్చిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే జార్ఖండ్ లో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. వాహ‌నాలు త‌నిఖీ చేసేందుకు వెళ్లిన ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ ఘ‌ట‌న రాంచీలో బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

రాంచీ నగరంలోని తుపుడ‌నా ఔట్‌పోస్ట్‌ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య తోప్నే. ఓ పిక్‌-అప్ వాహ‌నంలో అనుమానాస్ప‌ద వ‌స్తువుల‌ను ర‌వాణా చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో సంధ్య త‌నిఖీల‌కు వెళ్లారు. వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనం డ్రైవ‌ర్‌ వేగంగా దూసుకొచ్చి ఎస్సైపైకి వాహ‌నం ఎక్కించాడు.

'పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో ఎస్సైని ఢీకొట్టాడు డ్రైవర్‌. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద‍్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి వాహనాన్ని సీజ్‌ చేశాం. 'అని సీనియర్‌ ఎస్పీ కౌశల్‌ కిశోర్‌ తెలిపారు.

హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్‌ అధికారిని మైనింగ్‌ మాఫియా హత‍్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం గ‌మ‌నార్హం.

Next Story