మీర్‌పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు

మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.

By -  Knakam Karthik
Published on : 13 Oct 2025 4:25 PM IST

Crime News, Hyderabad, Meerpet, Madhavi murder case, Rachakonda Cp, Rangareddy Court

మీర్‌పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు

హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో వివాహిత మాధవి హత్య కేసు తెలంగాణలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కీలక ప్రకటన చేశారు. మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తులో సేకరించిన సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. అయితే విచారణ చేపట్టిన రెండు నెలల్లోనే తీర్పు వస్తుందని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు రోజువారీ ట్రయల్స్ జరపనుంది. కాగా ఈ సంవత్సరం జనవరి నెలలో మాధవిని ముక్కలు ముక్కలుగా నరికి భర్త గురుమూర్తి అతి కిరాతకంగా హత్య చేశాడు.

Next Story