హైదరాబాద్‌లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్

హైదరాబాద్‌లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది

By -  Knakam Karthik
Published on : 14 Oct 2025 10:39 AM IST

Crime News, Hyderabad, Domalaguda police station, Elderly couple attacked

హైదరాబాద్‌లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్

హైదరాబాద్‌లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 6లోని హెరిటేజ్ అపార్ట్మెంట్స్‌లో నివసించే ఈ వృద్ధ దంపతులు దాదాపు ఎనిమిది నెలల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన గోవర్ధన్‌ను కేర్‌ టేకర్‌గా నియమించుకున్నారు. అయితే కేర్ టేకర్ గోవర్ధన్ తమపై దాడి చేసి ఇంట్లోని 8 తులాల బంగారంతో పరారయ్యాడు..అని ఆనందరావు, అన్నపూర్ణ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న దోమలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story