Video : డాక్ట‌ర్ వద్ద‌ స్టెత‌స్కోప్‌, మెడిక‌ల్ కిట్ ఉంటాయి..ఆయ‌న ద‌గ్గ‌ర మాత్రం..

ఢిల్లీ, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్‌ను తన ఇంట్లో పెట్టుకుని అమ్మకాలు సాగిస్తూ ఎక్సైజ్ ఎస్టిఎఫ్ బీ టీమ్‌ కు జాన్ పాల్ అనే పీజీ డాక్టర్ పీజీ చదువుతున్న డాక్టర్ పట్టుబడ్డాడు

By -  Knakam Karthik
Published on : 4 Nov 2025 5:30 PM IST

Crime News, Hyderabad,  drug hub, Telangana STF, Doctor arrested

Video : డాక్ట‌ర్ వద్ద‌ స్టెత‌స్కోప్‌, మెడిక‌ల్ కిట్ ఉంటాయి..ఆయ‌న ద‌గ్గ‌ర మాత్రం..

హైదరాబాద్: పది మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు వైద్య వృత్తితో ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతకమైన డ్రగ్స్ కు బానిస అయ్యాడు. డ్రగ్స్ కొనాలంటే తనకు తగినంత డబ్బు లేదని ముగ్గురు స్నేహితులు చేసే డ్రగ్స్ వ్యాపారం లో పాలుపంచుకున్నాడు. ఢిల్లీ, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్‌ను తన ఇంట్లో పెట్టుకుని అమ్మకాలు సాగిస్తూ ఎక్సైజ్ ఎస్టిఎఫ్ బీ టీమ్‌ కు జాన్ పాల్ అనే పీజీ డాక్టర్ పీజీ చదువుతున్న డాక్టర్ పట్టుబడ్డాడు. ముషీరాబాద్ లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రగ్ సమ్మకాలు జరుపుతున్న జాన్ పాల్ ను ఎస్టిఎఫ్ బీ టీం పట్టుకున్నారు. వైద్యుడి ఇంట్లో తనిఖీలు చేస్తున్న తరుణంలో అతని ఇంట్లో లభించిన డ్రగ్సును చూసి ఎస్ టి ఎఫ్ టీమ్‌ ఆశ్చర్యపోయారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులు బెంగుళూరు ఢిల్లీ నుంచి డ్రగ్స్ ను తెప్పిస్తారు. వచ్చిన డ్రగ్స్‌ను డాక్టర్ జాన్ పాల్ నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో పెట్టి అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. ముగ్గురు చెప్పిన వారికి జాన్ పాల్ నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో పెట్టి అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. ముగ్గురు చెప్పిన వారికి డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ వచ్చిన డబ్బును వారికి ఇస్తూ ఉంటాడు. ఈ అమ్మకాలు జరిపినందుకు తన వద్ద ఉన్న డ్రగ్స్ ను తాను ఉచితంగా వాడుకుంటూ డాక్టర్ జాన్ పాల్ అమ్మకాలు జరుపుతూ చేసి పెడుతున్నట్లు డాక్టర్ జాన్ పాల్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.

ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ విజయ్ కృష్ణ సిబ్బంది కలిసి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 26.95 గ్రాముల ఓజి కుష్,6.21 గ్రాముల ఎండిఎం ఎ, 15 ఎల్ ఎస్ డి బాస్ట్స్, 1.32 గ్రాముల కొకైన్,5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాసిస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఈ డ్రగ్స్ విలువ రూ. 3 లక్షలు ఉంటుందని ఎస్ఐ బాలరాజు తెలిపారు. డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై కూడా కేసు నమోదు చేశారు.

Next Story