డబ్బుల విషయంలో గొడవ.. ఐస్‌ క్రీం అమ్ముకునే వ్యక్తిని చంపాడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో 23 ఏళ్ల ఐస్‌క్రీమ్ విక్రేతను కత్తితో పొడిచి చంపాడు.

By అంజి  Published on  25 April 2024 6:00 AM GMT
Delhi, Ice cream vendor, India Gate, arrest

డబ్బుల విషయంలో గొడవ.. ఐస్‌ క్రీం అమ్ముకునే వ్యక్తిని చంపాడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో 23 ఏళ్ల ఐస్‌క్రీమ్ విక్రేతను కత్తితో పొడిచి చంపాడు. మృతుడు 25 ఏళ్ల ప్రభాకర్‌గా గుర్తించారు. ప్రభాకర్‌ ఐస్ క్రీం విక్రయిస్తున్నాడని, చెల్లింపు విషయంలో కస్టమర్‌తో వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విషయం తీవ్రరూపం దాల్చడంతో నిందితుడు ప్రభాత్‌ను కత్తితో పొడిచి ఘటనా స్థలం నుంచి పారిపోయారు.

అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే ప్రభాత్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

''తగాదాల కారణంగా మృతుడిపై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుడి శరీరంపై మూడు గాయాలు ఉన్నాయి, వాటిలో ఒకటి చాలా లోతుగా ఉంది, దాని కారణంగా అతను మరణించాడు. బాధితుడి బ్యాగ్‌ నుంచి కొంత డబ్బు, గడియారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు తెలిపారు. పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఉత్తర ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో 25 ఏళ్ల ఐస్ క్రీం విక్రేతను అనేకసార్లు కత్తితో పొడిచి చంపారు.

Next Story