బాలికపై ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్‌ అత్యాచారం.. మెట్రోస్టేషన్‌ దగ్గర అపస్మారక స్థితిలో..

మెట్రో స్టేషన్ సమీపంలో మైనర్ బాలికపై ఆమె సోషల్ మీడియా 'స్నేహితుడు' అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆమె అపస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం తెలిపారు.

By అంజి  Published on  29 Feb 2024 1:26 AM GMT
Delhi, Crime news

బాలికపై ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్‌ అత్యాచారం.. మెట్రోస్టేషన్‌ దగ్గర అపస్మారక స్థితిలో..

ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలోని దబ్రీ మెట్రో స్టేషన్ సమీపంలో మైనర్ బాలికపై ఆమె సోషల్ మీడియా 'స్నేహితుడు' అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆమె అపస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం తెలిపారు. బాలిక కథనం ప్రకారం.. మంగళవారం మెట్రో స్టేషన్ సమీపంలో స్పృహతప్పి పడిపోయింది. ఆమెను కొట్టి అక్కడ పడేసినట్లు పోలీసులు చెప్పారు. మైనర్ అయిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

"ఆమె తన సోషల్ మీడియా స్నేహితుడిని కలవాలని నిర్ణయించుకున్నట్లు మాకు తెలిసింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ అమ్మాయి తన ఇంటికి తిరిగి రావడానికి రిక్షా తీసుకుని మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చింది. అక్కడ స్పృహతప్పి పడిపోయింది. స్వల్ప గాయాలయ్యాయి" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

బాలిక తన కోచింగ్ క్లాస్‌కు వెళ్లిన తర్వాత తన స్నేహితుడిని కలిసింది. ఆ తర్వాత ఆమెపై స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొందరు బాటసారులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. దీని తరువాత, ఆమె తన కుటుంబానికి జరిగిన కష్టాన్ని వివరించింది, వారు పోలీసులను ఆశ్రయించారని అధికారి తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story