డిగ్రీ విద్యార్థి దారుణ హత్య.. ప్రియురాలి కుటుంబ సభ్యుల పనేనా.!

Degree student found dead under suspicious circumstances in Peddapalli. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి సమీపంలో డిగ్రీ విద్యార్థి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు

By అంజి  Published on  20 Feb 2022 2:20 PM GMT
డిగ్రీ విద్యార్థి దారుణ హత్య.. ప్రియురాలి కుటుంబ సభ్యుల పనేనా.!

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి సమీపంలో డిగ్రీ విద్యార్థి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారంకు చెందిన దామ తరుణ్ (19) పెద్దపల్లిలో డిగ్రీ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన నూనె శివ, నూనె అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం తరుణ్‌కు ఫోన్ చేసి తరుణ్ నివాసం నుంచి ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఆ తర్వాత బాధితుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శివ, అనిల్‌పై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం వెన్నంపల్లి గ్రామ శివారులో తరుణ్ మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శివ, అనిల్‌తో కలిసి తమ కుమారుడిని హత్య చేశారని తరుణ్ తల్లిదండ్రులు దామ మొండయ్య, పద్మ ఆరోపించారు. తరుణ్‌ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. వారి సంబంధాన్ని అమ్మాయి కుటుంబం వ్యతిరేకించడంతో వారు తరుణ్‌ను హత్య చేశారని వారు తెలిపారు. తరుణ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, విచారణలో మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story