ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Couple, minor son killed in road accident near Chickballapur. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం చిక్‌బల్లాపూర్ శివారులో ఓ ప్రైవేట్ బస్సు స్కూటర్‌ను

By అంజి  Published on  1 March 2022 2:56 AM GMT
ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం చిక్‌బల్లాపూర్ శివారులో ఓ ప్రైవేట్ బస్సు స్కూటర్‌ను ఢీకొట్టడంతో దంపతులు, వారి 13 ఏళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మహమ్మద్ గౌస్ (37), అతని భార్య అమ్మజాన్ (33), వారి కుమారుడు రెహాన్‌గా గుర్తించారు. మహమ్మద్‌ గౌస్‌ హోస్‌పేటకు చెందినవారు కాగా, అమ్మజాన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కదిరికి చెందినవారు. గౌస్ సెకండ్ హ్యాండ్ వెహికిల్ వ్యాపారం చేస్తుండడంతో దంపతులు చిక్‌బల్లాపూర్‌లో ఉంటున్నారు. సోమవారం భార్యాభర్తలు తమ బంధువు వద్దకు వెళ్లారు.

తిరిగి వెళ్తుండగా హొన్నహళ్లి క్రాస్‌ వద్దకు రాగానే రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లేందుకు యూ టర్న్‌ తీసుకుంటుండగా బాగేపల్లి నుంచి చిక్‌బల్లాపూర్‌ వెళ్తున్న బస్సు స్కూటర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బాధితులు, స్కూటర్‌ గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ బస్సును కొన్ని గజాల దూరంలో ఆపి 40 మంది ప్రయాణికులను వదిలి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే చాలా మంది ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిక్‌బల్లాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

Next Story