పాఠశాల పిల్లలను వ్యభిచారంలోకి దింపుతున్న.. మహిళ సహా ఆరుగురు అరెస్ట్‌

పాఠశాల బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై చెన్నై పోలీసులు ఒక మహిళ, ఆమె ఆరుగురు సహచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  22 May 2024 9:01 AM GMT
Chennai, Crime, prostitution, arrest

పాఠశాల పిల్లలను వ్యభిచారంలోకి దింపుతున్న.. మహిళ సహా ఆరుగురు అరెస్ట్‌

పాఠశాల బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై చెన్నై పోలీసులు ఒక మహిళ, ఆమె ఆరుగురు సహచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. రిపోర్ట్‌ ప్రకారం.. ప్రధాన నిందితురాలు కె నదియా బ్యూటీషియన్ కోర్సులు బోధిస్తానని నెపంతో తన కుమార్తెతో స్నేహం చేస్తున్న సహ విద్యార్థులను బలవంతం చేసింది. ఆ తర్వాత ఆమె విద్యార్థినిల ఆర్థిక నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని బెదిరించి వ్యభిచారంలోకి దింపింది. ఇందుకు వారికి రూ. 25,000 నుండి రూ. 35,000 వరకు ఆఫర్ చేసిందని, ప్రధానంగా హైదరాబాద్, కోయంబత్తూరుకు చెందిన వృద్ధుల కోసం వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఎంఐడిసి పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మహిళను కోర్టులో హాజరుపరచగా, ఆమెను మే 24 వరకు పోలీసు కస్టడీకి అప్పగించినట్లు అధికారి తెలిపారు. రాజ్‌భవన్‌పై పెట్రోల్‌ బాంబు దాడి ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నుంచి పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఎన్‌ఏఐ బృందం.. నిందితుడు కడుకా వినోద్‌కు తెలిసిన సహచరుడి నివాసంలో సోదాలు చేస్తున్నప్పుడు, నదియాను అతని స్నేహితురాలుగా గుర్తించి, రాకెట్‌కు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కనుగొన్నారు.

ఆ తర్వాత రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ రాజలక్ష్మి నేతృత్వంలోని బృందం ఒక లాడ్జిపై దాడి చేసి, నదియాను అరెస్టు చేసింది. దాడి తరువాత శనివారం పోలీసులు 17 ఏళ్ల బాలిక, 18 ఏళ్ల యువతిని రక్షించారు. వ్యభిచారం కొనసాగించడానికి ఇష్టపడని బాలికలను మగవారితో కలిసి ఉన్న వీడియోలు ఉన్నాయని, వాటిని పిల్లల తల్లిదండ్రులకు పంపుతామని నదియా బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది. నదియాతో పాటు రామచంద్రన్, సుమతి, మాయా ఓలి, జయశ్రీ, అశోక్ కుమార్, రామేంద్రన్ అనే మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story