ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ ఇంట విషాదం..‌ కుమార్తె ఆత్మహత్య

Chalasani Srinivas Daughter Commits Suicide. ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ ఇంట విషాదచాయ‌లు అల‌ముకున్నాయి.

By Medi Samrat
Published on : 19 Feb 2021 9:49 AM IST

Chalasani Srinivas Daughter Commits Suicide

ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ ఇంట విషాదచాయ‌లు అల‌ముకున్నాయి. ఆయ‌న‌‌ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైద్రాబాడ్‌ రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న శిరిష్మకు.. గ్రానైట్‌ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో వివాహమైంది. ప్రస్తుతం వారిద్దరు గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు.

అయితే.. శిరిష్మ‌కు పెళ్లై నాలుగేళ్లవుతున్నా.. వీరికి సంతానం కలగకపోవడంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సిద్ధార్థ్‌.. ఉరేసుకున్న శిరిష్మను చూసి కిందకి దింపి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.






Next Story