షాకింగ్‌.. ఇంట్లోకి చొరబడి మహిళ రొమ్ములను నరికేశారు

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక నాయకుడి నేతృత్వంలోని కొందరు వ్యక్తులు ఓ మహిళ రొమ్ములను నరికారు.

By అంజి  Published on  10 Dec 2023 12:58 AM GMT
Bihar, Woman, Begusarai, Crime news

షాకింగ్‌.. ఇంట్లోకి చొరబడి మహిళ రొమ్ములను నరికేశారు 

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక నాయకుడి నేతృత్వంలోని కొందరు వ్యక్తులు ఓ మహిళ రొమ్ములను నరికిన సంఘటన గురించి పోలీసులు శనివారం తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి తియాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తియాయ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఈ ఘటనను ధృవీకరించారు.

''మేము బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసాము. దయానంద్ పాశ్వాన్, ఇతరులపై హత్యాయత్నానికి ప్రయత్నించడం ఓ మహిళ యొక్క నమ్రతకు భంగం కలిగించడం వంటి అభియోగాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాము. నిందితులు పరారీలో ఉన్నారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి'' అని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

స్థానికంగా గుండా రాజకీయాలకు పేరు మోసిన వ్యక్తి పాశ్వాన్, అతని సహాయకులు తన పేరు మీద భూమిని రిజిస్టర్ చేయమని బాధితురాలిపై ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించింది. పాశ్వాన్ కన్నేసిన ఆ గ్రామంలో ఆ మహిళకు ఒకటిన్నర ఎకరం భూమి ఉంది. ఆమె నిరాకరించడంతో, పాశ్వాన్ ఆమెను కనీసం సగం భూమిని అడిగాడు. బాధితురాలు గ్రామంలో ఒంటరిగా నివసిస్తుండగా, ఆమె భర్త, కుమారుడు వేరే రాష్ట్రంలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పాశ్వాన్, అతని సహాయకులు ఆమె ఇంటిపై దాడి చేసి ఆమె రొమ్ములను నరికి సంఘటన స్థలం నుండి పారిపోయారు.

ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను భగవాన్‌పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు ఆమెను సదర్ ఆసుపత్రికి తరలించారు.

Next Story