ప్రియురాలితో శృంగారం చేస్తుండగా గుండెపోటుతో మృతి.. భర్త, సోదరుడితో కలిసి చివరికి ఆ పని

Bengaluru man dies of heart attack while having sex with girlfriend. కర్ణాటకలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ప్లాస్టిక్‌ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం

By అంజి  Published on  25 Nov 2022 6:03 AM GMT
ప్రియురాలితో శృంగారం చేస్తుండగా గుండెపోటుతో మృతి.. భర్త, సోదరుడితో కలిసి చివరికి ఆ పని

కర్ణాటకలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ప్లాస్టిక్‌ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఆ వ్యక్తి తన ప్రియురాలితో సెక్స్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడని తేలింది. వ్యక్తి మృతదేహాన్ని అతని ప్రియురాలు, ఆమె భర్త, ఆమె సోదరుడు ఓ నిర్జన ప్రదేశంలో పడేశారు. 67 ఏళ్ల వ్యాపారవేత్త 35 ఏళ్ల మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడు నవంబర్ 16న తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో శృంగారంలో ఉండగా గుండెపోటుకు గురై మంచంపై మృతి చెందాడు. ఈ ఘటన తెరపైకి వస్తే సమాజంలో తన పరువు పోతుందని భయపడిన మహిళ వెంటనే తన భర్త, సోదరుడికి ఫోన్ చేసింది. మహిళ, ఆమె బంధువులు వ్యాపారవేత్త మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి జెపి నగర్‌లోని ఏకాంత ప్రదేశంలో పడేశారు.

జేపీ నగర్‌లోని పుట్టెనహళ్లి నివాసి బాల సుబ్రమణియన్‌గా గుర్తించిన ఆ వ్యక్తి నవంబర్ 16న తన మనవడిని బ్యాడ్మింటన్ తరగతులకు దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 4.55 గంటల ప్రాంతంలో బాలా తన కోడలికి డయల్ చేసి తనకు కొంత వ్యక్తిగత పని ఉందని, తాను ఆలస్యంగా ఇంటికి వస్తానని తెలిపాడు. బాలా కుటుంబ సభ్యులు అతని గురించి వెతికారు. చివరకు అతని కుమారుడు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ ఫిర్యాదు నమోదైన ఒక రోజు తర్వాత, ప్లాస్టిక్ కవర్‌లో బెడ్‌షీట్‌లో ప్యాక్ చేసి అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మహిళను విచారించారు. పోలీసులు ప్రశ్నించగా, ఆ మహిళ తన 67 ఏళ్ల ప్రియుడి మృతదేహాన్ని పారవేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు తనపై హత్య కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని రోడ్డుపై పడేసింది. బాల సుబ్రమణ్యం తన ప్రియురాలితో చాలా కాలంగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని వెల్లడైంది. బాలా గతేడాది యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నాడు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళ చేసిన వాదనలు నిజమో కాదో నిర్ధారించడానికి వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.

Next Story