యువతిని కొడవలితో పొడిచి చంపిన మేనమామ.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి పారిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని

By అంజి  Published on  7 May 2023 8:00 AM GMT
Uttar Pradesh, Crime news, Sithapur

యువతిని కొడవలితో పొడిచి చంపిన మేనమామ.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి పారిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఇంట్లో నుంచి బయటకు లాగి హత్య చేశారు. యువతిని ఆమె మామ హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన సీతాపూర్ జిల్లా పిసావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్‌నగర్ గ్రామంలో జరిగింది. సీతాపూర్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) ఎన్‌పి సింగ్ ఈ సంఘటన గురించి సమాచారం ఇస్తూ.. బజ్‌నగర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ సంబంధం కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది.

ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంబంధం గురించి యువతి మేనమామ శ్యామూసింగ్‌కు తెలియడంతో అతడు యువతిని ఘజియాబాద్‌కు పంపించాడు. యువతి తండ్రి పుతన్ సింగ్ తోమర్ ఘజియాబాద్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత రూప్ చంద్ర మౌర్య కూడా ఘజియాబాద్ చేరుకున్నాడు. ఆ అమ్మాయి అతనితో పాటు ఇంటి నుంచి పారిపోయింది. ఇంటి నుంచి పారిపోయిన తర్వాత గత ఏడాది నవంబర్‌లో ప్రియుడితో యువతికి కోర్టులో వివాహం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఆమె రూప్‌చంద్రతో కలిసి గ్రామానికి తిరిగి వచ్చింది. ఈ విషయం యువతి మామ శ్యామూసింగ్‌కు తెలియడంతో సహనం కోల్పోయాడు.

శనివారం రూప్ చంద్ర ఇంటికి చేరుకుని మేనకోడలిని ఇంట్లో నుంచి బయటకు లాగి కొడవలితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత శ్యామూ సింగ్ పిసావాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హత్యకు ఉపయోగించిన కొడవలితో సహా పోలీసులకు లొంగిపోయాడు. తన మేనకోడలు పారిపోయి, అప్పటికే వివాహమై వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకే హత్య చేశానని శ్యాము చెప్పినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హంతకుడు శ్యామూసింగ్‌ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story