రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తండ్రిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కొడుకు

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ తనయుడు ఆగ్రహానికి లోనై కన్నతండ్రినే చంపేశాడు.

By అంజి  Published on  5 April 2024 4:01 AM GMT
Rangareddy district, Crime news

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తండ్రిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కొడుకు

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ తనయుడు ఆగ్రహానికి లోనై కన్నతండ్రినే చంపేశాడు. కుమారుడు తన తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కయాంజల్ ఆరెంజ్ అవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న కొడుకు అనురాగ్ మత్తుపదార్థాలకు బానిసయ్యాడు. ప్రతిరోజు మత్తు పదర్థాలు సేవించి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లందర్నీ వేధింపులకు గురి చేసేవాడు. మత్తుపదార్థాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలంటూ ఇంట్లో నానా హంగామా సృష్టించే వాడు.

రోజు రోజుకీ అతని వేధింపులు మితిమీరి పోయాయి. రోజు ఇంట్లో వాళ్లను వేధించవద్దని కొడుకును తండ్రి మందలించడంతో ఆగ్రహానికి లోనైనా కొడుకు అనురాగ్ ఒక్కసారిగా తండ్రి తిరుపతి (42) పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయిన తండ్రి తిరుపతి మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పరారీలో ఉన్న కొడుకు అనురాగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story