తెలంగాణలో దారుణం.. పెళ్లైన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో 'మేఘాలయ హనీమూన్ మర్డర్' తరహా ఘటన వెలుగు చూసింది. పెళ్లయిన నెల రోజులకే భర్తను హత్య చేయించింది.
By అంజి
తెలంగాణలో దారుణం.. పెళ్లైన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో 'మేఘాలయ హనీమూన్ మర్డర్' తరహా ఘటన వెలుగు చూసింది. పెళ్లయిన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. భార్యకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. భార్య ప్రియుడు కొందరికి సుపారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించాడు. 5 రోజుల కిందట గద్వాలలో అదృశ్యమైన వరుడు.. ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్గా పని చేస్తున్నాడు. తేజేశ్వర్కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయం చేశారు.
అయితే పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగోచ్చిన ఐశ్వర్య. తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. తన మాటలతో మెల్లగా తేజేశ్వర్ను ఐశ్యర్య బుట్టలో పడేసింది. ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెతో పెళ్లికి ఒకే చెప్పాడు. మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు నుంచే ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా అనునిత్యం ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టింది.
దీంతో ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా.. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గాలింపులో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ డెడ్బాడీ దొరికింది. తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా.. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పని చేస్తోంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటాలో తేలింది.
ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలిగిస్తే అతని ఆస్తి తమ సొంతమవుతుందని మర్డర్కు ప్లాన్ గీసినట్టు తెలిసింది. తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ని వారి వెంట పంపినట్టు తెలిసింది. పక్కా ప్లాన్తో.. కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ ను కలిసి, తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్ పై కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఐశ్వర్య, సుజాతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.