Hyderabad: దారుణం.. గర్భిణిని గొంతు నులిమి చంపిన భర్త

భార్య హత్యను కప్పిపుచ్చేందుకు ఓ వ్యక్తి ఆమె మృతదేహానికి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో మహిళ గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది.

By అంజి
Published on : 21 Jan 2025 9:37 AM IST

Atrocity , Hyderabad, Husband strangles pregnant woman, Crime

Hyderabad: దారుణం.. గర్భిణిని గొంతు నులిమి చంపిన భర్త

హైదరాబాద్ : భార్య హత్యను కప్పిపుచ్చేందుకు ఓ వ్యక్తి ఆమె మృతదేహానికి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో మహిళ గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. నిందితుడు సచిన్ (21)ను కుషాయిగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏడు నెలల గర్భిణి అయిన సచిన్ భార్య స్నేహా ఠాగూర్ (21) తరచూ వివాదాల కారణంగా విడివిడిగా ఉంటున్న సచిన్‌తో ఇటీవల రాజీ పడింది. 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట కుషాయిగూడలోని నాగార్జుననగర్‌లోని ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు.

జనవరి 16న సచిన్.. స్నేహ నిద్రిస్తున్న సమయంలో ఆమెపై గుడ్డతో గొంతు నులిమి చంపేశాడు. దీంతో స్నేహతో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా మృతి చెందింది. అనంతరం ఇంట్లో మంటలు చెలరేగేందుకు గ్యాస్ సిలిండర్ తెరిచాడు. స్నేహ తల్లి తన కూతురిని చూసేందుకు రాగా, తన కూతురు విగతజీవిగా ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టంలో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత సచిన్‌ను అరెస్టు చేశారు.

Next Story